బోదన్ , బతుకమ్మ:
బోధన్ పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద ఆటో స్టాండ్ డ్రైవర్లు నిరసనకు దిగారు. బుదవారం బోదన్ పోలిస్ స్టేషన్ ఎదుట ఆటో డ్రైవర్లు నిరసన తెలిపి అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ సంధర్బంగా ఆటో డ్రైవర్ యూనియన్ నాయకులు మాట్లాడుతు.. బస్టాండ్ వద్ధ ఓక్కరిద్ధరు ప్రూట్ బండ్ల నిర్వహకుల వల్ల ప్రతి నిత్యం ట్రాఫిక్ జాం అవుతుందని వాపోయారు. విద్యా సంస్థలకు, ఆసుపత్రులకు వచ్చే ప్రయాణికులకు పండ్ల దుకాణాల నిర్వహకులు ఇబ్బందులు కలుగ జేస్తున్నారని తెలిపారు. వారిపై గతంలో సిఐ కి పిర్యాదు చేశామని కాని సమస్య పరిష్కరం చూపలేదన్నారు. మజ్లీస్ పార్టి నాయకుల అండతో ఆటో డ్రైవర్లకు తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలన్నారు.