వాటిని తింటున్నారా.. అంతే సంగతి!..

  •  దుకాణంలో కాలం చెల్లిన ఫుడ్ ఐటమ్స్ విక్రయాలు
  •  ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి

రుద్రూర్, బతుకమ్మ : మండల కేంద్రంలో కొన్ని గ్రామాల్లో గల కిరాణా దుకాణాలల్లో కాలం చెల్లిన ఫుడ్ఐటమ్స్ను విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. చిన్న పిల్లలు తినే స్నాక్స్ నుంచి యువకులు ఎక్కువగా తాగే తమ్సప్, స్పైట్ల పై కొంతమంది స్నాక్స్ రూపంలో కిరాణంలో దొరికే బొంగుల ప్యాకెట్లు, ముర్మురా ప్యాకెట్లు వంటి వాటికి గ్రామాల్లో కొన్ని వస్తువులకు ఉన్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని నాసిరకాలను తెచ్చి జనాలకు అంటగడుతున్నారు. ఇదే తరహాలో మండలంలోని అంబం గ్రామంలో కొంతమంది యువకులు గ్రామంలోని ఓ కిరాణా షాప్ లో కొన్ని స్నాక్స్ ప్యాకెట్లను కొనుగోలు చేశారు. కొద్ది సేపటి తర్వాత కొనుగోలు చేసిన ఆ ప్యాకెట్లను ఓపెన్ చేసేసరికి గుప్పున పాచిన వాసన వచ్చింది. వాటిని చూసి ఆ యువకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. తీరా చూసాక ఎక్సైరీ డేట్ అయిపోయి నాలుగు నెలలవుతోంది. ఇంకేముంది వెంటనే ఆ ప్యాకెట్లను తీసుకొని ఆ షాప్ కి వచ్చారు. మరోసారి చూద్దామని ఆ యువకులు స్నాక్స్ ప్యాకెట్లను ఇవ్వమన్నారు. మళ్ళీ కాలం చెల్లిన తరహా ప్యాకెట్లనే ఆ దుకాణదారుడు ఇవ్వడం జరిగింది. ఇదంతా చూసిన ఆ యువకులు దుకాణదారుడిని ఇవేం ప్యాకెట్లు కాలం చెల్లిన వాటిని ఎందుకు అమ్ముతున్నావని అతనిని ప్రశ్నించారు. ఇదే కాదండీ చిన్న పిల్లలు తినే స్నాక్స్ ప్యాకెట్లు కూడా నకిలీ పేర్లతో షాపుల్లో విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. చిన్నారులను ఆకర్షించేలా, చూడడానికి బ్రాండెడ్తరహాలోనే ఉంటున్నా తక్కువ రేటుకే మాల్దొరుకుతుండడంతో షాపుల నిర్వాహకులు వాటినే తెచ్చి అమ్మేస్తున్నారు. ఇలాంటి వారిపై ఫుడ్ సేఫ్టీ అధికారులు చెక్కింగ్ చేసి కొరడా దులిపించాలని ప్రజలు కోరుతున్నారు.

Are you eating them? That's it!
Comments (0)
Add Comment