చెట్టును డికోట్టిన ఆర్టిసీ బస్సు

. . . ప్రమాదవశాత్తు చెట్టును డికోట్టిన బస్

. . . ప్రమాదఘటన స్థలాన్ని పరిశీలించిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే

బతుకమ్మ, ఎల్లారెడ్డి

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల పరిధిలో కామారెడ్డి ఎల్లారెడ్డి ప్రధానరహదారిపై హాజీపూర్ తండా మూలమాలుపు దగ్గర ఆర్టీసీ బస్సు చెట్టును డికోట్టింది. ఈ సంఘటన సోమవారం మద్యహ్నం జరిగింది . ప్రమాదం జరిగినప్పుడు కామారెడ్డి డిపో బస్సులో 50 మందికిపై గా ప్రయాణికులు ఉన్నారు. ఈ  విషయం తెలుసుకొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకొని సొంత ట్రస్ట్ అంబులెన్సు లో క్షతగాత్రులను ఆసుపత్రికి పంపించారు. వైద్యులతో మాట్లాడి క్షతగాత్రులకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించామని సిబ్బంది కి ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత  అధికారికి ఫోన్లో మాట్లాడి రోడ్డు కి అడ్డుగా వున్న చెట్టు కొమ్మలను తొలగించాలని ఆదేశించారు.

An RTC bus that cut down a tree
Comments (0)
Add Comment