20 వరకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు
- ఇంటర్ విద్యాధికారి రవికుమార్
బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : ఈ నెల 20వ తేది వరకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు తీసుకోవచ్చని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి తిరుమలపూడి రవికుమార్ అన్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి గాను అకాడమిక్అడ్మిషన్ల విషయమై నిజామాబాద్ జిల్లా ఇంటర్ విద్య కార్యాలయంలో మంగళవారం ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాల్ ల సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్లను ఈ నెల 20వ తేదీ వరకు ఇంకా తీసుకోవచ్చన్నారు. పదవ తరగతి ఉత్తీర్ణులైన పేద, బడుగు, మైనారిటీ, బలహీనర్గాలకు చెందిన విద్యార్థి, విద్యార్థులను కళాశాలలో చేర్పించేందుకు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చేయాలన్నారు. 20వ తేదీ లోగా ప్రతి విద్యార్థి డేటాను కంప్యూటర్లలో నిక్షిప్తం చేయడంతో పాటు విద్యార్థుల ఫోటోసంతకాలను కూడా ఆన్ లైన్ లో నిక్షిప్తం చేయాలని ఆదేశించారు. అలాగే ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ పూర్తి చేయాలని, అవసరమైతే మరిన్ని పాఠ్యపుస్తకాలను ఇంటర్ బోర్డు నుండి తెప్పించడానికి కృషి చేస్తామని తెలిపారు. అలాగే కళాశాలలలో పచ్చదనం, పరిశుభ్రత , మొక్కలు నాటడం వాటిని పరిరక్షించడం పై ప్రిన్సిపాల్ లు దృష్టి సారించాలని ఆదేశించారు. కళాశాలలలో విద్యార్థిని విద్యార్థుల కు ర్యాగింగ్ నిరోధక చట్టం గురించి అవగాహన కల్పించాలని అన్నారు. ఏ కళాశాలలో ర్యాగింగ్ జరగకూడదని ఆదేశించారు. విద్యార్థిని విద్యార్థులు చదువుపై దృష్టి సారించేలా ప్రిన్సిపాల్ లు కృషి చేయాలని ఆదేశించారు. అలాగే మత్తు పదార్థాలు, డ్రగ్స్, సెల్ ఫోన్ల వాడకం నిషేధించాలని వాటి పై తదితర సామాజిక మాధ్యమాలపై కూడా విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఇందుకోసం కళాశాల కమిటీ లను ఏర్పాటు చేసి విద్యార్థిని విద్యార్థులకు మత్తు పదార్థాల వాడకం నిషేధం, ర్యాగింగ్ నిషేధం పై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని ఆదేశించారు. ప్రతి కళాశాలలో ఈ అంశాలపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని జిల్లా ఇంటర్ విద్యా అధికారి ఆయా కళాశాలల ప్రిన్సిపాల్ లను ఆదేశించారు. ప్రతి కళాశాలలో మొక్కలు నాటడంతోపాటు వాటి పరిరక్షణ పై దృష్టి సారించాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లాలోని అన్నీ ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్ లు పాల్గొన్నారు.
Related