3 వ కల్లు డిపో సొసైటీ లో సభ్యత్వం కోసం నకిలీ ఆధార్ కార్డులు సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలి

  • గౌడ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్

బతుకమ్మ, నిజామాబాద్ : నకిలీ ఆధార్ కార్డులు సృష్టించి భవాని ట్యాడీ కో-ఆపరేటివ్ సొసైటీ మూడు లో సభ్యత్వం పొందిన వారిపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని గౌడ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఈ. శ్రీనివాస్ గౌడ్ కోరారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ కు మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండ నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన కొంత మంది వ్యక్తులు తప్పుడు దృవ పత్రాలతో భవాని కల్లు గీత పారిశ్రామిక సహకార సంఘం నిజామాబాద్ అనే నకిలీ సంఘాన్ని సృష్టించారని పేర్కొన్నారు. భీమ్గల్ మండలంలోని గోనుగోప్పల, పురానిపేట్, ముచ్చకూర్, సిరికొండ మండలంలోని న్యావ, వేల్పూర్ గ్రామాలకు చెందిన కొందరు వ్యక్తులు నిజామాబాద్ నగరానికి చెందిన పత్రాలు చూపిస్తూ టిసిఎస్ మూడులో సభ్యత్వం పొందారని తెలిపారు. వీరంతా ఒక్కో ఇంటి చిరునామా పై ఐదుగురు సభ్యులు ఉన్నట్లు ఆధార్ కార్డులో చూపించారని పేర్కొన్నారు. ఈ విషయంలో చేపూరి స్వామి గౌడ్, సేపురు జయసింహా గౌడ్ , సేపూర్ సుమన్ గౌడ్లు తప్పుడు ఆధార్ కార్డులు తయారు చేయించార ని అన్నారు. స్థానికులకే సొసైటీలో సభ్యత్వం కల్పించాలని నిబంధన అమలు చేయాలని జిల్లా కలెక్టర్, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ లకు ఫిర్యాదు చేశామన్నారు. దీంతో వారు మాపై పరోక్ష బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. తప్పుడు ఆధార్ కార్డు చూపి సభ్యత్వం పొందిన వారిపై సమగ్ర విచారణ చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Action should be taken against those who create fake Aadhaar cards for membership in Kallu Depot Society.Legal action should be taken against those responsible
Comments (0)
Add Comment