రక్షిత మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలి

-వామపక్ష విద్యార్థి సంఘాల డిమాండ్

బతుకమ్మ, నిజామాబాద్ : వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యార్థిని రక్షిత మృతిపై ఉన్నతస్థాయి అధికారి ద్వారా సమగ్ర విచారణ చేపట్టాలని పీడీ ఎస్ యూ, ఏ ఐ ఎస్ ఎఫ్, ఎస్ ఎఫ్ ఐ, ఏ ఐ పీ ఎస్ యూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు బుధవారం నిరసన తెలిపారు. అనంతరం కలెక్టరేట్ ఏవో కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీడీ ఎస్ యూ  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నామాల అజాద్, ఏ ఐ పీ ఎస్ యూ రాష్ట్ర అధ్యక్షులు బోడ అనిల్ మాట్లాడుతూ రుద్రూరు అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థి రక్షిత మృతిపై కలెక్టర్ పర్యవేక్షణలో కమిటీ వేసి ఉన్నత స్థాయి అధికారితో సమగ్రమైన విచారణ జరపాలన్నారు. విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. శనివారం  అనుమానస్పద స్థితిలో రుద్రూర్ పాలిటెక్నిక్ హాస్టల్ బాత్రూంలో విద్యార్థి రక్షిత చనిపోయే ముందు సీసీ కెమెరాలు పనిచేయకపోవడం , కుటుంబ సభ్యులు రాకముందే అమ్మాయి మృతదేహాన్ని హుటాహుటిన హాస్పిటల్ కు తరలించడంపై అనుమానాలున్నాయన్నారు. మృతి చెందిన విషయాన్ని బయట ప్రపంచానికి తెలియనివ్వకుండా దాచేప్రయత్నంలో భాగంగానే తల్లిదండ్రులు రాకముందే మృతదేహాన్ని ఆసుపత్రికి పంపించడం వెనుక ఆంతర్యమేముందని ప్రశ్నించారు. ప్రిన్సిపాల్, వార్డెన్ ల పర్యవేక్షణ లోపంపై చర్యలు చేపట్టాలన్నారు. విద్యార్థిని కుటుంబానికి పది లక్షల రూపాయలిచ్చి ఆదుకోవాలన్నారు.  ఈ కార్యక్రమంలో ఏ ఐ ఎస్ ఎఫ్జిల్లా కార్యదర్శి రఘురాం,పీడీ ఎస్ యూ  జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.నరేందర్, కర్క గణేష్, ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి విగ్నేష్,పీడీ ఎస్ యూ జిల్లా ఉపాధ్యక్షులు ఎల్.అనిల్ కుమార్, జిల్లా కోశాధికారి నిఖిల్, ఏ ఐ పీ ఎస్ యూనగర కార్యదర్శి సందీప్, ఏ ఐ ఎస్ ఎఫ్, జిల్లా అధ్యక్షురాలు అంజలి, పీడీ ఎస్ యూ నాయకులు నాగేష్, నసిర్, మంగ, అర్చన తదితరులు పాల్గొన్నారు.

A thorough inquiry should be conducted into the death of Raksha
Comments (0)
Add Comment