దాడులకు నిరసనగా వినతిపత్రం అందజేత

బతుకమ్మ,మోర్తాడ్ :బంగ్లాదేశ్ లో మైనారిటీలుగా ఉన్న హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మంగళవారం ర్యాలీ నిర్వహించి తహసిల్దార్ సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంగ్లాదేశ్ ముస్లింలు హిందువులపై దౌర్జన్యాలు, హత్యలు అత్యాచారాలు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు. ఇంత జరుగుతున్నా కూడా మానవ హక్కుల సంఘాలు ఇప్పటివరకు స్పందించడం లేదని ధ్వజమెత్తారు. ఇదంతా కూడా హిందూ సమాజంపైన, హిందూ ప్రజల పైన జరుగుతున్న దాడిగా వారు అభివర్ణించారు. కొన్ని అరాచక శక్తులు మైనారిటీలో ఉన్న హిందువులను మాత్రమే టార్గెట్ గా చేసుకొని దాడులకు పాల్పడుతున్నారన్నారు. భారతదేశంలో చోరబడ్డ బంగ్లాదేశీయులను తక్షణమే గుర్తించాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. హిందువులపై జరుగుతున్న దాడులు తక్షణమే మానుకోవాలని ఈ సందర్బంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు పుప్పాల నరేష్, జెడి గంగారెడ్డి, కుంట శ్రీనివాస్, ఒడ్డెం ప్రభోగశాంత్, కోరం ప్రకాష్ , లక్ష్మీ నరసయ్య గోపిడి గంగారెడ్డి , రాము గౌడ్, గంగారెడ్డి, వినాయక రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి , రాజేశ్వర్, రాడేమోహన్, సవీన్ తదితరులు పాల్గొన్నారు.

A petition was presented in protest against the attacks
Comments (0)
Add Comment