బతుకమ్మ, నిజామాబాద్
తెలంగాణ మున్నూరు కాపుల సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా పెద్ద పండుగగా నిలుస్తున్న ఎడ్ల పొలాల అమావాస్య అని తెలంగాణ మున్నూరు కాపు ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు తోట రాజశేఖర్ అన్నారు. నగరంలోని ప్రగతి నగర్ మున్నూరు కాపు కళ్యాణ మండపంలో సోమవారం ఎడ్ల పొలాల అమావాస్యను తెలంగాణ మున్నూరు కాపు ఉద్యోగ, విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాపుల పంటకు అండగా నిలుస్తున్న పశుసంతతిని పూజ చేసి వాటి ఆశీస్సులను అందుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. దీన్ని భవిష్యత్తు తరాలకు మన సంస్కృతిని ్రపతిబింబింప చేయాలని సంకల్పించి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. కళ్యాణ మండపం ఆవరణలో ఉన్న రైతు, నాగలి, ఎడ్ల ్రపతిమతకు పూజ నిర్వహించి పండుగను ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో పంటను పండించడంలో ప్రతిభ చాటుతున్న రైతులను సత్కరించి సన్మానించామని తెలిపారు. సింధు నాగరికత నుంచి ఈ పండుగ పునాదులు వేసుకుందని నాటి నుంచి నేటి వరకు రైతుల కుటుంబాల్లో భాగమైన ఎడ్లను పూజించి ఆశీస్సులు అందుకోవడం గొప్ప సాంప్రదాయంగా వస్తుందన్నారు.
రైతు పురస్కారాలు వీరికే..
ఎడ్ల పొలాల అమావాస్యని పురస్కరించుకొని వ్యవసాయంలో ప్రతిభ చాటిన ఉత్తమ రైతులను సన్మానించారు. బిలాల్ అనిల్ కుమార్ గాజుల్పేట్, పరిగ శ్రీనివాస్ కుర్నాపల్లి, కానాపురం రాహుల్ మొత్తకుంట వీరికి రైతు పురస్కారాలు అందజేసి సన్మానించారు. వీరితో పాటు వ్యవసాయ శాఖలో పదవి విరమణ పొందిన సహాయ సంచాలకులు ఎడ్ల గంగాధర్ రావు పటేల్ ను ఘనంగా సన్మానించారు. ఇలాంటి కార్యక్రమాలను భవిష్యత్తులో నిర్వహించి కాపుల సంస్కృతి సాంప్రదాయాలనుపతిబింబింప చేస్తామని సంఘం ప్రతినిధులు కట్టించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంఘం కార్యదర్శి డాక్టర్ అబ్బాపూర్ రవీంద్ర పటేల్, కోశాధికారి బాశెట్టి సురేష్ పటేల్, ఉపాధ్యక్షులు హరిచరణ్ పటేల్, సంయుక్త కార్యదర్శి పరిగి సాయికుమార్, డాక్టర్ సల్ల సత్యనారాయణ, సాయి రెడ్డి పటేల్, అబ్బాయి మోహన్ పటేల్, ప్రసాద్ పటేల్ పాల్గొన్నారు.