రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండలంలోని అంబం (ఆర్ ) గ్రామంలో సోమవారం సాయంత్రం ఎస్ఐ పి. సాయన్న ప్రజలకు హెల్మెట్ పై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు రోడ్డుపై వెళ్లేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్ ధరించి వాహనాలు నడపటం వలన ఒక రక్షణ కవచంలా ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.