మురికి కాలువలో బాలిక గల్లంతు

  • గాలిస్తున్న అగ్నిమాపక సిబ్బంది

బతుకమ్మ, నిజామాబాద్ క్రైమ్ : నిజామాబాద్ నగరం లోని వర్ని రోడ్డులోని ఆనంద్ నగర్ లో రెండేళ్ల బాలిక మురుగు నీటి కాలువలో గల్లంతైంది. ఈ సంఘటన బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. అను(2) బాలిక ఇంటి ముందు ఆడుకుంటుండగా ప్రమాద వశాత్తూ కాలువలో పది గల్లంతైంది.

అప్పటి వరకు ఉన్న బాలిక కనిపించక పోవడం తో తల్లి తన కూతురు కాలువలో గల్లంతైన విషయం గుర్తించి గగ్గోలు పెట్టడం తో ఈ విషయం వెలుగు చూసింది. అగ్ని మాపక సిబ్బంది కాలువ వద్దకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఇటీవల నగరం లో భారీ వర్షాలకు డ్రైనేజీ ఉదృతంగా ప్రవహిస్తుండటంతో బాలిక ఆచూకీ లభించలేదు. రాత్రి కావడం తో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

A girl drowned in a dirty canal
Comments (0)
Add Comment