- బస్ షెటర్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులు
రుద్రూర్, ఆగస్టు 11 (బతుకమ్మ న్యూస్) : రుద్రూర్ మండల కేంద్రంలోని జేయన్సీ కాలనీ వద్ద బస్ షెటర్ ను నిర్మించాలని కాలనీవాసులు, ప్రయాణికులు కోరారు. కాలనీ వద్ద బస్ షెటర్ లేకపోవడంతో ప్రయాణికులు రోడ్డు ప్రక్కనే నిలబడి బస్సు కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎండాకాలం, వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీవాసులు, ప్రయాణికులు వాపోతున్నారు. ఇంతకు ముందు కాలనీ వద్ద బస్ షెటర్ నిర్మాణం చేపట్టారు. కానీ కొన్ని అనివర్యకారణాల వలన బస్ షెటర్ నిర్మాణ పనులను మధ్యలోనే నిలిపి వేశారన్నారు. కావున బోధన్ ఆర్టీసీ అధికారులు వెంటనే స్పందించి జేయన్సీ కాలనీ వద్ద బస్ షెటర్ ను నిర్మించాలన్నారు. అదేవిధంగా ప్రయాణికుల కొరకు ప్రతి ఒక్క బస్సు జేయన్సీ కాలనీ వద్ద ఆపే విధంగా చూడాలని కాలనీవాసులు, ప్రయాణికులు కోరుతున్నారు.