బతుకమ్మ,బోధన్ : నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. పది నెలల బాలుడిని కుక్కలకు బలయ్యాడు. ఈ విషాదకరఘటన నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో జరిగింది. ఈ సంఘటన మంగళవారం బాలుడి తల్లి తన కుమారుడు కిడ్నాప్ కు గురయ్యాడని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగు చూసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు చేసుకున్న పోలీసులు బస్ డిపోలో గాలించగా బాలుడి శరీర బాగాలు లభించడంతో వెలుగులోకి వచ్చింది. బస్ స్టాండ్ పరిసరాల్లో బిడ్డను వదిలి బహిర్భూమికి వెళ్లడంతో అదే సమయంలో బాలున్ని నోట కరుచుకుని వీధి కుక్కలు వెళ్లినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బోధన్ సిఐ వెంకటనారాయణ తెలిపారు.